మహావీర్ జయంతి ర్యాలీకి వేలాది జైన భక్తులు హాజరు

భగవాన్ మహావీర్ 2625వ జయంతి సందర్భంగా నగరంలో జైన భక్తులు భారీగా తరలివచ్చారు. మంగళవారం బేగంబజార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు నిర్వహించిన ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. శ్రీ జైన్ సేవా సంఘ్ నిర్వాహకుల అంచనా ప్రకారం 20,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల బైక్ ర్యాలీ, ఒంటెల సవారీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సంబంధిత పోస్ట్