శ్రీచైతన్య పాఠశాల ఆధ్వర్యంలో 'గ్రీన్ ఇండియా మిషన్' అవగాహన ర్యాలీ

సమాజంలోని ప్రతి పౌరుడు భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలని వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలని శ్రీచైతన్య స్కూల్స్ మెహిదీపట్నం జోన్ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్ ఎన్. స్వాతి తెలిపారు. మొక్కలు నాటినప్పుడే వాయు కాలుష్యం తగ్గి,వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, భూగర్భ జలాలు పెరిగి, నీటికి ఇబ్బందులు ఉండవని వారు స్పష్టం చేశారు. స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో 'గ్రీన్ ఇండియా మిషన్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతపట్టి 'మొక్కల పెంపకం చేపట్టాలి' అంటూ పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏజీఎం కృష్ణ ప్రారంభించారు. అనంతరం కృష్ణ, ఎన్. స్వాతి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని,అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థి దశ నుంచే మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచుకోవాలని, తమ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల ఆర్‌ఐ హరికృష్ణ, కోఆర్డినేటర్ జనార్దన్,డీన్ మల్లేష్,ఇంచార్జ్‌లు బాలరాజు, ఆంజనేయులు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్