జీడిమెట్లలో తయారైన వందలాది బిర్యానీలను ఫ్రిజ్లో నిల్వ ఉంచి, ఓవెన్లో వేడిచేసి జొమాటో ద్వారా బంజారాహిల్స్లో అమ్మకాలు జరుపుతున్న ఒక రెస్టారెంట్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల క్రితం తయారుచేసిన బిర్యానీలను తాజాగా ఉన్నాయని నమ్మించి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.