తెలంగాణ ప్రజారోగ్య శాఖ మాజీ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్లో జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. డాక్టర్ శ్రీనివాసరావు ప్రజాసేవ, పరిపాలనా అనుభవం, ప్రజారోగ్య రంగంలో చేసిన సేవలు పార్టీకి బలాన్ని చేకూరుస్తాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో ఆయన అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు.