ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఇంద్రసేనారెడ్డి, కోట శ్రీనివాసరావు తెలుగు సినీ రంగానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.