మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ను సందర్శించారు. అక్కడ ఉన్న ఒక కేఫ్లో ఉస్మానియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ను ఆస్వాదించారు. కేఫ్ యజమాని అస్లాం బిన్ అబూద్ ఆయనకు స్వాగతం పలికారు. చార్మినార్ వద్ద టీ తాగకుండా పాతబస్తీ పర్యటన పూర్తికాదని కేటీఆర్ అన్నారు. ఆయన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపారు.