రైతు డిస్కం అంశాన్ని ఆరు నెలలు గోప్యంగా ఉంచి, ఇప్పుడు సీఎం చిట్చాట్లో ప్రస్తావించడం అనుమానాలకు తావిస్తోందని తెలంగాణ రక్షణ సేన నేత కవిత ఆదివారం బంజారాహిల్స్లో విమర్శించారు. 24 గంటల ఉచిత విద్యుత్ ఎత్తివేయబోమని, మీటర్లు ఏర్పాటు చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రెస్మీట్లో ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. రైతు డిస్కం పేరుతో మిగతా రెండు డిస్కంలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు.