తెలంగాణలో సంచలనం రేపుతున్న బెట్టింగ్ మాఫియా కేసులపై ED దృష్టి సారించింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులలో 29 మంది సినీ ప్రముఖులతో పాటు ఇతరులపై కేసులు నమోదయ్యాయి. దీనిపై RTC ఎండీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ‘‘కాసుల కోసం యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారా? మీరు బెట్టింగ్ను ప్రోత్సహించడం వల్లే యువత నేరాల బాట పట్టారు. సామాజిక బాధ్యత మరిచి డబ్బు కోసం తప్పు దారి పట్టడం తగదు’’ అంటూ ట్వీట్ చేశారు.