తెలంగాణలో నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఉదయం అన్ని జిల్లాల ఎస్పీలు తమ తమ పరిధిలోనే డ్యూటీలో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తాను ఛార్జ్ తీసుకునే రోజున ఎవరూ హైదరాబాద్కు రావొద్దని, తమ జిల్లాల్లోనే రిపోర్ట్ చేయాలని సూచించారు. సమయం వచ్చినప్పుడు తానే అందరినీ కలుస్తానని తెలిపారు.