ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ దాడులు చేసింది. హైదరాబాద్, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లోని నివాసాల్లో తనిఖీలు చేస్తున్నారు. హఫీజ్పేటలోని భుజంగరావు ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కాగా భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు.