కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ ఏపీహెచ్బీ కాలనీవాసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యేను కలిసి, నాలుగు నెలల క్రితం ఇచ్చిన వినతులకు స్పందించి నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కాలనీలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.