కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం

కేపీహెచ్బీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చిదురు ముదురు వర్షంతో మంగళవారం కూకట్ పల్లిలో వాహనదారులు ఒక్కసారిగా మెట్రోల కింద నిలిచిపోయారు. వర్షంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ నెలకొంది. వర్షం నీరు నిలవడంతో ప్రజలు కాలినడకన వారు చేరుకునే గమ్యాలకు వెళ్లిపోతున్నారు. వర్షం తగ్గడంతో వాహనదారులు ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్