పదేళ్ల నిరీక్షణకు గాంధీ ఆస్పత్రిలో తెరపడింది. సంతానం కోసం ప్రైవేట్లో రూ.లక్షలు ఖర్చు చేసి విఫలమైన బోయగూడకు చెందిన కూలీ దంపతులు, గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో చికిత్స పొంది బుధవారం కవలలకు (ఒక బాబు, పాప) జన్మనిచ్చారు. బయట రూ.12 లక్షలయ్యే ఈ చికిత్సను వైద్యులు పూర్తిగా ఉచితంగా అందించారు. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేసిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.