చాదర్ఘాట్ పోలీసులు CEIR పోర్టల్ సహాయంతో రికవరీ చేసిన 11 మొబైల్ ఫోన్లను గురువారం బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా ఏసీపీ సుబ్బారామి రెడ్డి, ఇన్స్పెక్టర్ మురారి కసాని మాట్లాడుతూ, ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే CEIR పోర్టల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. టెక్నాలజీ సాయంతో ఫోన్లను గుర్తించి తిరిగి అందించిన పోలీసులను బాధితులు అభినందించారు. ఫోన్ పోయిన వెంటనే 1930 నంబర్కు కాల్ చేయాలని కోరారు.