చాదర్ఘాట్ పోలీసులు సామాజిక బాధ్యతను చాటుకున్నారు. మలక్పేట గంజ్ మార్కెట్ ఫుట్పాత్పై ఆశ్రయం పొందుతూ, సరైన ఆహారం, వసతి లేక ఇబ్బంది పడుతున్న ఐదుగురు వ్యక్తులను (వేణుగోపాల్, నర్సింహ, కృష్ణ, భరత్, అనిల్) పోలీసులు గుర్తించారు. ఇన్స్పెక్టర్ కె. బి. మురారి నేతృత్వంలోని బృందం బుధవారం వారికి ప్రాథమిక సహాయం అందించి, సురక్షితమైన షెల్టర్ హోమ్కు తరలించింది. పోలీసుల చొరవను స్థానికులు అభినందించారు.