మేడ్చల్ జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. 'నీ ఏడుపే బీజేపీకి శాపం' అని రాసి ఉన్న ఈ ఫ్లెక్సీలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ వివాదాస్పద ఫ్లెక్సీల వెనుక ఎవరున్నారనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.