మల్కాజ్ గిరి: ఈటెల రాజేందర్ కు జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పాలి: చేన్నారావు

ఎంపీ ఈటెలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని జాతీయ సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు చెన్నారావు డిమాండ్ చేశారు. బుధవారం మల్కాజ్ గిరిలో ఆయన మాట్లాడుతూ  ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఈటెలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. జగ్గారెడ్డి క్షమాపణలు చెప్పని పక్షంలో వాయిద్య కళాకారులతో 24 గంటల పాటు నిరసన తెలుపుతామని చెన్నారెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్