మేడ్చల్: 'ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలి'

2023 ఎన్నికల్లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఓయూ విద్యార్థి నాయకుడు కోట శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంచలన ఆరోపణ చేశారు. ఇరువురు 20 ఎకరాల భూమిని అఫిడవిట్ లో చూపించలేదన్న కోట శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం ద్వారా పూర్తి సమాచారం తమ వద్ద ఉందని అన్నారు. తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్