మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏదులాబాద్ డివిజన్లో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి సందర్శించారు. నిన్న రాత్రి కురిసిన వర్షాలకు తడిసిపోయిన వడ్లను పరిశీలించి, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. గత 20-25 రోజులుగా కష్టపడి కోత తీసిన వడ్లను కేంద్రానికి తీసుకువచ్చి ఎండబెట్టినా, టోకెన్లు ఇచ్చిన తర్వాత కూడా సరైన సమయంలో తరలించకపోవడం వల్ల చాలా నష్టం జరిగిందని ఆయన అన్నారు.