మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన ఇంట్లో హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. పిల్లలతో కలిసి రంగులు చల్లుకుంటూ, కార్యకర్తలతో కలిసి నృత్యాలు చేస్తూ ఆయన సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరూ జాగ్రత్తగా హోలీ జరుపుకోవాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, గల్ఫ్ యుద్ధం త్వరగా ముగియాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు.