తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మెమోరాండం సమర్పించిన అధ్యక్షుడు దామోదర్ గౌడ్, ఎక్సైజ్ నిబంధనల పేరిట బార్లను వేధిస్తున్నారని విమర్శించారు. అక్టోబర్లో మద్యం పాలసీకి ముందుగా తమ సమస్యలు పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.