మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు డీ. శ్రీనివాస్ మరణం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంలో డీ. శ్రీనివాస్ పార్థీవదేహం వద్ద నివాళులు అర్పించిన పొన్నం ప్రభాకర్ అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు.