నాంపల్లి: మంత్రి ఉత్తమ్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు

నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఉత్తమ్‌పై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసు విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్ జారీ చేసింది. తదుపరి విచారణ 16వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున తప్పకుండా కోర్టులో హాజరు అవ్వాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్