నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన చేప ప్రసాదం పంపిణీ కేంద్రాల వద్ద కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ప్రజలకు ఆహారం పంపిణీ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అస్తమా రోగులు, వారి సహాయకులు ఆకలితో ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు స్వచ్ఛంధ సంస్థలు తెలిపారు. రెండు రోజుల నుంచి భోజనం పంపిణీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.