నాంపల్లి: హుజూరాబాద్ కేసులో బండి సంజయ్‌కు ఊరట

హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ఓటుకు రూ. 25 వేలు ఇస్తోందంటూ ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన ఆరోపణలపై నమోదైన కేసును మంగళవారం నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. హుజూరాబాద్ పోలీసులు ఐపీసీ 188, 505(2) సెక్షన్ల కింద బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం, ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

సంబంధిత పోస్ట్