కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పెట్బషీరాబాద్ లోని డీసీపీ కార్యాలయంలో ఆదివారం పుష్ప సినిమా తరహాలో పనస పళ్ళ చాటున బొలోరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన షామీర్ పేట్ పియస్ పరిదిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం కరీంనగర్ వైపు ఓ బొలేరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో శామీర్పేట పోలీసులు, మేడ్చల్ ఎస్వోటీ, శామీర్పేట పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.