మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్కులో గత కొన్ని రోజులుగా భయాందోళన సృష్టించిన చిరుతపులి ఎట్టకేలకు బోనులో చిక్కింది. 25 రోజులుగా నార్సింగి పరిధిలోని వ్యాస్ నగర్, గ్రే హౌండ్స్, గోల్కొండ ప్రాంతాల్లో సంచరించిన చిరుత కోసం అధికారులు 8 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు ఏర్పాటు చేశారు. గురువారం ట్రెక్ పార్కు గేటు వద్ద పకడ్బందీగా చిరుతను బంధించారు. అధికారులు చిరుతను జూపార్కుకు తరలించనున్నారు.