సికింద్రాబాద్లోని శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవాలకు మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆలయ అధికారులు ఆహ్వానించారు. మంగళవారం ఆలయ ఈవో శ్రీనివాస శర్మ, ప్రధాన అర్చకులు బద్రీనాథ్ చార్యులు తలసాని క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు సమాచారం.