తెలంగాణ జాగృతి మహిళా విభాగం నేతలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోమవారం హైదరాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. చైర్పర్సన్ నేరెళ్ల శారద అందుబాటులో లేకపోవడంతో సభ్యులు సుదం లక్ష్మీ, రేవతి రావు, ఉమా, అప్రోజ్ సహీనాకు ఫిర్యాదు లేఖను అందజేశారు. మల్లన్న క్షమాపణ చెప్పకుండానే మరింత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని నేతలు ఆరోపించారు.