అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సనత్ నగర్ ఫైర్ స్టేషన్లో ఈ నెల 20 వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి తొలిరోజు 'సంస్మరణ పరేడ్'ను నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎగ్జిబిషన్ స్టాల్ను సనత్ నగర్ ఫైర్ ఆఫీసర్ పూర్ణకుమార్ ప్రారంభించారు.