వెస్ట్ మారేడ్పల్లిలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మే 1 నుండి ప్రారంభం కానున్న ఓటరు జాబితా ఇంటింటి సర్వే (SIR) విషయంలో BRS శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సర్వేపై అనేక అనుమానాలు ఉన్నందున, ప్రతి బూత్కు ఒక ఏజెంట్ను నియమిస్తున్నట్లు తెలిపారు. అధికారులు వచ్చినప్పుడు ఓటర్లకు అవగాహన కల్పించాలని, కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టాలని సూచించారు.