సికింద్రాబాద్ తాడ్ బండ్ దేవాలయ కార్యనిర్వాహణాధికారి నరేందర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి పురస్కరించుకొని తాడ్ బండ్ హనుమాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శనివారం ఉదయం నుండే పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు హనుమాన్ చాలీసా పారాయణాలతో తాడ్ బండ్ హనుమాన్ దేవాలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.