హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ను సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ కలిశారు. డివిజన్లో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులు కబ్జాకు యత్నిస్తున్నట్లు కలెక్టర్కు తెలిపారు. ప్రభుత్వ భూములను కాపాడాలని, కబ్జాకోరులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సుభాష్ చంద్రబోస్ నగర్ లో మిగిలిన డబుల్బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు.