బేగంపేట నాలాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

సికింద్రాబాద్ బేగంపేట పోలీస్టేషన్ పరిధిలోని నాలాలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం బయటపడింది. మృతదేహం మొత్తం కాలిపోయి ఉండడంతో ఇందిరమ్మ నగర్ నాల వద్ద విషయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్ కు చెరుకున్న బేగంపేట పోలీసులు మృతదేహంను బయటకు తీసి గాంధీ మార్చురికి తరలించారు. మృతదేహం మొత్తంగా ఖాలిపోయి ఉండడంతో పాటు నీళ్ళలో ఉండిపోవడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చెస్తున్నారు.

సంబంధిత పోస్ట్