మధిరలో సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య జరిగి తొమ్మిది రోజులు గడిచినా దోషులను పట్టుకోలేదని సీపీఎం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం జాతీయ నేత బి.వి. రాఘవులు మాట్లాడుతూ, "ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం. మా నాయకుడిని హత్య చేసినవారు కాంగ్రెస్ నాయకులేనని మేము చెబుతున్నాం. అయినా ఇప్పటి వరకు పోలీసులు వారిని పట్టుకోలేకపోవడం తీవ్ర నిర్లక్ష్యం. దోషులను పట్టుకుని శిక్షించే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం," అని హెచ్చరించారు. హత్యపై విచారణను వేగవంతం చేయాలని, న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీపీఎం నేతలు స్పష్టం చేశారు.