జేఈఈ మెయిన్ 2026 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎన్టీయే అవకాశం

దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్‌, బీఆర్క్‌ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత రిజిస్ట్రేషన్లు నవంబర్ 27న ముగిశాయి. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎన్టీయే అవకాశం కల్పించింది. డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తుల్లోని వివరాలను సవరించుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత మరో అవకాశం ఇవ్వబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్