హైదరాబాద్ ఐటీ కారిడార్లో మద్యం మత్తులో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకొని కత్తిపోట్ల కలకలం రేగింది. సోమాలియా దేశానికి చెందిన అహ్మద్పై కత్తితో దాడి చేసి గాయపరిచారు. అతడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మరో ముగ్గురు యువకుల కోసం గాలింపు జరుపుతున్నారు.