మేడే వేడుకలో పాల్గొన్న డిసిసి జనరల్ సెక్రెటరీ గండికోట కుమార్

మే డే సందర్భంగా మాణికేశ్వరి నగర్ కార్మిక సంఘం ఆటో యూనియన్ అధ్యక్షులు వరికుప్పల వెంకటయ్య ఆధ్వర్యంలో ఆటో స్టాండ్ వద్ద వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను డిసిసి జనరల్ సెక్రెటరీ గండికోట కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన గండికోట కుమార్, సమస్యల పరిష్కారానికి త్వరలోనే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేముల గణేష్, గండికోట కిరణ్, ఆటో యూనియన్, పెయింటింగ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్