తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య జయంతి ఉత్సవ కమిటీ సభ్యునిగా గొరిగే నరసింహను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ జగ్గయ్య మల్లేష్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ దొడ్డి కొమరయ్య త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. కురుమ సంఘం నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.