మే 1న ఉదయం 6 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో బహుజన విద్యార్థి సంఘాలు, స్టూడెంట్స్ ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ సందర్భంగా శాంతి వాక్కు కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఓయూ రిజిస్టర్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేంద్రనాయక్, ఓయూ సీఐ మహేష్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బహుజన విద్యార్థి సంఘాల జేఏసీ చైర్మన్ వేల్పుల సంజయ్, మారథాన్ రన్నర్ చిన్నపాక స్వామి, విద్యార్థి నాయకులు ముక్క రమేష్ పిలుపునిచ్చారు.