దొంగతనాలు చేయడంలో సెంచరీ పూర్తి చేశాడు శంకర్ నాయక్ అనే ఓ దొంగ. జల్సాలకు అలవాటు పడి వరుస చోరిలకు పాల్పడుతున్న యువకుడిని బుధవారం ఓయూ పోలీసులు అరెస్ట్ చేసి 9 లక్షల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఓయూ పీఎస్ పరిధిలో జరిగిన చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు ఎల్బీ నగర్ లో ఉన్న శంకర్ నాయక్ తో పాటు మరో వ్యక్తి ని అదుపులోకి తీసుకొని విచారించారు.