ఓటరు జాబితా పరిశీలన: కాంగ్రెస్ పార్టీ ఇంటింటికీ ప్రచారం

హైదరాబాద్‌లోని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి మార్గదర్శకత్వంలో, హెచ్‌ఎంటి నగర్ డివిజన్‌లో బుధవారం ఓటరు జాబితా పరిశీలన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటూ, కొత్త ఓటర్లను నమోదు చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్‌ఎంటి నగర్ కాంగ్రెస్ నాయకులు సామ భావన గౌడ్ ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు.

సంబంధిత పోస్ట్