ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ పోర్ట్ఫోలియోలోని అన్ని కార్లపై గరిష్ఠంగా ఒక శాతం మేర ధరలను పెంచాలని నిర్ణయించింది. ఈ కొత్త ధరలు మే నెల నుంచి అమలులోకి రానున్నాయి. విడిభాగాలు, తయారీ ఖర్చులు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని కంపెనీ తెలిపింది. మోడల్, వేరియంట్ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వెల్లడించింది.