గతేడాది జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయిన ఏఐ-171 విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ (39) తీవ్ర మానసిక సంఘర్షణను ఎదుర్కొంటున్నాడు. ప్రమాదం జరిగి ఏడాది పూర్తయినా, ఆ భయానక జ్ఞాపకాలు తనను వెంటాడుతున్నాయని, నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని తెలిపాడు. ఈ ప్రమాదంలో తన సోదరుడు అజయ్ను కోల్పోయినట్లు పేర్కొన్నాడు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు, మిత్రుల సహకారం మరిచిపోలేనిదని, త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.