AP: అనంతపురం జిల్లా గుత్తిలో రైలు పట్టాలపై యువకుడి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ‘ఈ రోజు నేను చనిపోతున్నా. అన్ని అబద్ధాలు చెప్పి, నా జీవితం నాశనం చేసింది. నా తల్లిని, అక్కని అందరినీ అవమానించింది’ అంటూ మహిళ చేతిలో మోసపోయిన నారాయణస్వామి అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. యువకుని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.