లార్డ్స్ మైదానంలో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దిలీప్ వెంగ్సర్కార్ (3) తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన టీమిండియా బ్యాటర్గా KL రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ.. తాను రిషబ్ పంత్తో బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదించానన్నాడు. ఎలాగైనా అతడిలా షాట్లు కొట్టాలని ఉందని కేఎల్ రాహుల్ తన మనసులో మాటను బయటపెట్టాడు. రాహుల్ పంత్తో కలిసి నాలుగో వికెట్కు 141 పరుగులు జోడించాడు.