తాను ఎప్పుడూ భారత ప్రజల పక్షానే నిలబడతానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. లోక్సభలో మంగళవారం ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా పూర్తి చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పారు. భారతీయుల భావనలతో తన స్వరం మిళితం చేసుకుని ముందుకెళ్తున్నట్లు తెలిపారు. భారత సైన్యం సత్తా ప్రపంచం మొత్తం చూసిందన్నారు. కలుగులో ఉన్న పాక్ ముష్కరులను పొగ బెట్టి మరీ హతమార్చామని తెలిపారు.