AP: ప.గో. జిల్లా తణుకులో సోమవారం మహిళా అఘోరీ ప్రత్యక్షమయ్యారు. అఘోరా బాబాగా పిలవబడుతున్న రాజేశ్ నాథ్ అంతు చూస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అఘోరా ముసుగులో రాజేశ్ నాథ్ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అఘోరీ ఆరోపించారు. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేశ్ నాథ్ ఇంటి ముందు అఘోరీ ఆందోళన చేశారు. కాగా, రాజేశ్ నాథ్ రాసలీలలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇద్దరమ్మాయిలతో రాజేశ్ నాథ్ చేసిన అసభ్య చాటింగ్ నెట్టింట వైరలవుతోంది.