మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదాలపై మంచు లక్ష్మి తొలిసారి స్పందించారు. తన కుటుంబం మళ్ళీ పాత రోజుల్లాగే ఒక్కటిగా మారాలని దేవుడిని కోరుకుంటానని తెలిపారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజమని, ఎన్ని వివాదాలు వచ్చినా చివరికి కుటుంబమే మిగులుతుందని అన్నారు. తాను ముంబైలో ఉండటం వల్ల కుటుంబ విషయాలను పట్టించుకోలేదనే వార్తలపై ఖండించారు. వ్యక్తిగత విషయాలను చర్చించడం ఇష్టం లేదని కుటుంబం కోసం పోరాడటమే నిజమైన బాధ్యతని అన్నారు.