ఈసారి ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ మాత్రం వైభవ్లో నటుడిని చూశాడు. ప్రస్తుతం 'మసూమ్: ద న్యూ జనరేషన్' సినిమాని తెరకెక్కిస్తున్న శేఖర్ కపూర్, వైభవ్ అమాయక రూపం, సహజ వ్యక్తిత్వం తనని ఆకట్టుకున్నాయని, ఒకవేళ అతను క్రికెటర్ కాకపోయింటే తన సినిమాలో నటించేవాడని వ్యాఖ్యానించాడు.